Friday, May 3, 2024

RR | మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్… మహేశ్వరంలో మెడికల్ కాలేజీ

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : సరస్వతి నిలయమైన మహేశ్వరంలో మరో విద్యాలయం ఏర్పాటు కానుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా మహేశ్వరంలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ బుధవారం జీవో విడుదల చేశారు. మెడికల్ కాలేజీ మంజూరుపై విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ హామీ మేరకు 100 సీట్లతో మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం జీవో విడుదల చేసింది.

విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి కోరిక మేరకు మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ హామీ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీచేసింది. దాంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజల తరుపున మంత్రి సబితారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దినదినాభివృద్ది చెందుతున్న మహేశ్వరం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్న ఫ్యాక్టరీలు, అంతర్జాతీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండటంతో మెడికల్ కళాశాల,ఆస్పత్రి మంజూరు చేయటంపై సబితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement