Thursday, May 16, 2024

తెలంగాణ అభివృద్ధికే క‌ట్టుబ‌డి ఉన్నాం..మ‌ధుయాష్కీ..

మొన్నా..నిన్న‌టి వ‌ర‌కు హుజూరాబాద్ ఎన్నిక‌ల‌తో మోతెక్కింది తెలంగాణ అంతా..ఇప్పుడు నిరుద్యోగ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తున్నారు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు. నిరుద్యోగ స‌మ‌స్యే ఎజెండాగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. టిఆర్ ఎస్ పాల‌న‌లో ఉద్యోగాలకి నోటిఫికేష‌న్లు రాక ఎంద‌రో యువ‌కులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని కాంగ్రెస్ నేత మ‌ధుయాష్కీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉద్యోగాల భర్తీపై ప్రకటనలు ఫుల్లుగా చేస్తున్నారని.. నియామకాలు మాత్రం నిల్లేనని ఆయ‌న అన్నారు. గడిచిన కొంత కాలంగా డీఎస్సీ, గ్రూప్ 1,2 నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ నీళ్లను దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

తెలుగు రాష్ట్రాలను కలపాలని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం అని.. కాంగ్రెస్ మాత్రం తెలంగాణ అభివృద్ధికే కట్టుబడి ఉందని అన్నారు. కల్వకుంట్ల సామ్రాజ్యాన్ని విస్తరించేందుకే ఆలోచనలో భాగంగానే తెలుగు రాష్ట్రాను కలపాలని చూస్తున్నారని ఆరోపించారు. 60 ఏళ్లు కొట్లాడి, ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ దయవల్ల తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేఖ విధానాలకు వ్యతిరేఖంగా 33 జిల్లాల్లో నవంబర్ 14 నుంచి 21 పాటు ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement