Sunday, April 28, 2024

Delhi Pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం… గాలి నాణ్యత ఎంతగా క్షీణించిందంటే!!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీపావళి మరుసటి రోజు కాలుష్యం పెద్దగా పెరగకపోయినా.. గత రెండు రోజుల నుంచి పరిస్ధితి భిన్నంగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో వాయు నాణ్యత క్షీణిస్తున్నది. నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300 పైనే ఉంటున్నది. తాజాగా ఆదివారం ఉదయం ఏఐక్యూ 350గా నమోదయింది.
మరికొన్ని ప్రాంతాల్లో 400 దాటిపోయింది. అత్యధికంగా ఆనంద్‌ విహార్‌లో ఏఐక్యూ 469గా ఉండగా, వజీర్‌పూర్‌లో 417, ముండ్కాలో 392, ఢిల్లీలో 385, ఆర్కే పురంలో 376, ఐటీఓ వద్ద 374, ఓఖ్లా ఫేజ్‌-2 వద్ద 370గా గాలి నాణ్యత నమోదైంది. ఘజియాబాద్‌లోని వసుంధరలో గాలి నాణ్యత 420కు చేరుకుంది. ఫరీదాబాద్‌లోని న్యూ ఇండస్ట్రియల్ టౌన్‌లో AQI 446గా నమోదైంది. వాయు ప్రమాణాలు పడిపోతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడానికి వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ ఎన్‌సీఆర్‌లో చర్యలకు ఉపక్రమించడంతో పాటు ప్రజలకు కీలక సూచనలు చేసింది. వీలైనంత వరకు ఉద్యోగాలు ఇంటి నుంచి పని చేయాలని, వాయు కాలుష్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement