Saturday, April 27, 2024

WPL | ఖాతా తెరిచి ఢ‌ల్లీ.. గుజ‌రాత్‌పై ఘన విజయం..

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల (సోమవారం) జరిగిన మ్యాచ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతా తెరిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ ను 119 పరుగులకే పరిమితం చేసింది. దీంతో 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లతో విజయం సాధించింది.

ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు ఇద్దరు చెలరేగి ఆడారు.. మెగ్ లానింగ్ (51) , షఫాలీ వర్మ (64 నాటౌట్) చరో హాఫ్ సెంచరీ చేశారు. ఇక మెగ్ లానింగ్ అవుట్‌ అవ్వడంతో క్రీజ్‌లోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (నాటౌట్) 4 తో మ్యాచ్‌ను మెగించింది.

అంత‌క ముందు బ్యాటింగ్ చేసిన‌ యూపీ వారియ‌ర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో శ్వేతా సెహ్రావత్‌ (45) ప‌రుగులు చేయ‌గా మిగిలిన వారు క‌నీసం 20 ప‌రుగులు కూడా చేయ‌లేదు. ఢిల్లీ బౌలర్లలో మరజన్నె కాప్‌ (3/5) పేస్‌తో నిప్పులు చెరగగా.. స్పిన్నర్‌ రాధా యాదవ్‌ సైతం మూడు (4/20) తో యూపీ వారియర్స్‌ను కట్టడి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement