Tuesday, April 30, 2024

Anantapuram – ఎపిలో సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను తీసుకొచ్చాం – మల్లికార్జున ఖర్గే

అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మరోవైపు.. రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ హాయంలోనే జరిగినట్లు చెప్పారు. అలాంటి.. సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను మీ ముందుకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘న్యాయ సాధన’ సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, బీజేపీపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ బలహీనం అయిందంటున్నారు… అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు కూల్చుతున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నియంత మోడీ వల్లనే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని తెలిపారు. మరోవైపు.. రాహుల్, సోనియా గాంధీపై తిట్ల దండకం చేస్తున్నారని.. తనను కూడా వదలడం లేదని అన్నారు.

దేశం అంతా అభివృద్ధి చేసింది తానేనని మోడీ అంటున్నారని.. ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ కాదా అని ఖర్గే తెలిపారు. దేశానికి మోడీ చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. మోడీ ధనికుల కోసమే పని చేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు.. రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ అంటే భయం పడుతున్నారని విమర్శించారు..

ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇస్తాం – షర్మిల

ఏపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి హామీని ప్రకటించింది. ఇందిరమ్మ అభయం పేరుతో తొలి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ పథకం కింద్ర ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. . మహిళల పేరు మీదే చెక్కు ఇస్తామని తెలిపారు. పేద కుటుంబాలు నిర్భయంగా బతికేందుకు, పేదరికం నిర్మూలన కోసం తీసుకొస్తున్న పథకం ఇందిరమ్మ అభయం పథకమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దివంగత రాజశేఖరరెడ్డి ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేశారని అన్నారు. ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు..

ఇతర రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా దూసుకు పోతున్నాయని… చంద్రబాబు, జగన్ ల పదేళ్ల పాలనలో ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని షర్మిల విమర్శించారు. పదేళ్లలో పట్టుమని 10 ఉద్యోగాలు కూడా రాలేదని అన్నారు. ప్రత్యేక హోదా జగన్ తోనే సాధ్యమని ప్రజలు నమ్మితే… అధికారాన్ని అనుభవిస్తూ ఆయన ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని విమర్శించారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో దీక్షలు చేయలేదని, రాజీనామాలు చేయలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడూ ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement