Monday, April 29, 2024

Delhi – ప్రాజెక్ట్ లు అప్ప‌గింత‌పై బిఆర్ఎస్ ఎంపిలు నిర‌స‌న ..

ఢిల్లీ – కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై నేడు ఢిల్లీలో బిఆర్ ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. అనంత‌రం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఎంపీల బృందం కలిసింది. తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖను అందజేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని.. వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో విచారణ పూర్తయ్యేవరకు ఇరు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement