Sunday, May 19, 2024

Hyd: రైలు కిందపడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

డిగ్రీ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పరిధిలోని కాచిగూడ రైల్వే పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. కాటేదాన్‌ సాయినగర్‌ కాలనీలో నివాసముంటున్న శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌ కుమారుడు రాగిణి రిషిగౌడ్‌(21) డిగ్రీ చదువుతున్నాడు. శివరాంపల్లి- బుద్వేల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement