Sunday, May 5, 2024

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం..మీరు జైలుకు వెళ్లడం తథ్యం: దాసోజు శ్రవణ్

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు…కటారులు పట్టుకుని తిరుగుతున్నారా…నాలుకలు కోస్తాం అంటున్నారు.. మాకు కత్తులు దొరకవా…. మేము నాలుకలు కోయలేమా. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం….మీరు జైలుకు వెళ్లడం తథ్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డుకు బియ్యం తెచ్చుకుని తినేవారికి బెంజ్ కార్లు ఎలా వచ్చాయి. రేవంత్ రెడ్డి జైలు కు వెళతారని అంటున్నారు. మీ భాగోతాలు మాకు తెలియవా మేము బైట పెట్టలేమా… రాజకేయాలను నీచమైన సంస్కృతికి దిగజార్చారని విరుచుకుపడ్డారు. ఏడేళ్లుగా దళిత, గిరిజన ప్రజల నోట్లో మన్ను కొట్టారని..ఇవాళ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ప్రజా సమష్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.. ఉద్యోగ ఖాళీల విషయములో… ఎందుకు ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడతారు అని నిలదీశారు.

ఇది కూడా చదవండి: రెండు వ్యాక్సిన్లు కలిపి వేసుకోవచ్చు: డీసీజీఐ

Advertisement

తాజా వార్తలు

Advertisement