Thursday, May 2, 2024

Cyclone Biparjoy – బిపర్‌జోయ్ విలయం – కూలిన చెట్లు, ఇళ్లు, విద్యుత్ స్తంభాలు

బిపర్‌జోయ్ సైక్లోన్ తీరాన్ని తాకిన అనంతరం గుజరాత్, కరాచీ తీర ప్రాంతాలతో పాటు రాజస్థాన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గుజరాత్ లోని జఖౌ, మాండ్వీ సహా కచ్, సౌరాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులతో విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు బిపర్‌జోయ్ తుపాను తీరాన్ని తాకడంతో కచ్ తీరం నుంచి పాకిస్తాన్ లోని కరాచీ తీరం వరకూ సముద్రంలోని అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. రాకాసి అలల ధాటికి సముద్రంలోని వంతెన కూడా పేకమేడలా కూలిపోయింది అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.

తుఫాను గురించి చెప్పిన దానికంటే ఇది చాలా ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు, స్తంభాలు నేలకొరిగాయి. మోర్బి జిల్లాలోని మాలియా తహసీల్‌లోని 45 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. . గత రాత్రి గుజరాత్ తీరాన్ని బిపార్‌జోయ్ తాకింది. దాని తక్కువ వేగం కారణంగా ఇది ముందుకు సాగడానికి సమయం పడుతుంది. బిపార్‌జోయ్ తుఫాను కేంద్రం సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో 30 కి.మీ ఉత్తరాన కేంద్రీకృతమై ఉంది..

బిపార్‌జోయ్ మధ్యాహ్నానికి రాజస్థాన్‌ను తాకవచ్చు. దీని తర్వాత రాజస్థాన్, హర్యానా, యూపీలో వాతావరణం మారవచ్చు. బలమైన గాలులు వీచవచ్చు. తుపాను కారణంగా 22 మంది గాయపడ్డారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 23 జంతువులు చనిపోగా, 524 చెట్లు నేలకూలినట్లు సమాచారం. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. సహాయక బృందాలు ఆ ప్రాంతమంతా విస్తరించి ఉన్నాయి. ఎక్కడ నష్టం జరిగినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే బృందాలు అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement