Tuesday, May 14, 2024

హైదరాబాద్​లో సీడబ్ల్యూసీ భేటీ.. తరలిరానున్న కాంగ్రెస్​ ముఖ్యనేతలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దూకుడుని పెంచుతోంది. ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన దాదాపు ఖరరావడంతో క్యాడర్‌లో జోష్ పెరిగింది. రేపటి (శనివారం) నుంచి 2 రోజుల పాటు తెలంగాణలో సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన దాదాపు ఖరారు అయింది. రేపు మధ్యాహ్నం 12:35 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి రాహుల్ గాంధీ నేరుగా తాజ్ కృష్ణ హోటల్ లో జరిగే cwc మీటింగ్ లో పాల్గొననున్నారు. ఎల్లుండి తుక్కుగూడ సభ అనంతరం శంషాబాద్ ఎయిర్ ఫోర్టు నుండే రాత్రి 8:50 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

రెండు రోజుల పాటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, సోనియాగాంధీ, 4 రాష్ట్రాల సీఎంలు, సీడబ్లయూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హైదరాబాద్​ రానున్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుంటున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్​లో చేరే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు తుక్కుగూడలో నిర్వహించే విజయభేరీ సభలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో కలిసి పార్టీలో జాయిన్ అవుతారన్న సమాచారం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement