Tuesday, April 30, 2024

Breaking: పుదుచ్చేరి తీరంలో ఆగిపోయిన క్రూయిజ్​ షిప్​.. పర్మిషన్​ ఇవ్వని లెఫ్టినెంట్​ గవర్నర్​ తమిళిసై

ఆంధ్రప్రదేశ్​ నుంచి పుదుచ్చేరి మధ్య పర్యాటకులను తిప్పేందుకు ఏర్పాటు చేసిన క్రూయిజ్​ షిప్​ని పుదుచ్చేరికి రాకుండా అడ్డుకున్నారు అక్కడి అధికారులు. మొన్న ఏపీ మంత్రి రోజా ఈ షిప్​ని గ్రాండ్​గా లాంచ్​ చేశారు. అయితే ఇందులో క్యాసినో, గ్యాంబ్లింగ్​ వంటివి నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ షిప్​ని తమ ఏరియాలోకి రాకుండా పుదుచ్చేరి అధికారులు అడ్డుకున్నారు. ఫస్ట్​ టైమ్​ అడ్డుకున్న అధికారులు ఇవ్వాల రెండోసారి కూడా అట్లాగే షిప్​ని రాకుండా నిలువరించారు.

ఏపీ, పుదుచ్చేరి మధ్య క్రూయిజ్​ షిప్​ వివాదం కొనసాగుతూనే ఉంది. మరోసారి పుదుచ్చేరి తీరంలో నౌకను ఆపేశారు అధికారులు. అయితే దీనికి అనుమతి లేదన్నారు లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​. ఆ షిప్​లో క్యాసినో, గ్యాంబ్లింగ్​ జరగడం లేదని నిర్ధారించిన తర్వాతే అనుమతంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండోసారి కూడా షిప్​ సముద్రంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement