Sunday, April 28, 2024

ఛార్‌దామ్ యాత్ర‌కు తగ్గిన భక్తుల ర‌ద్దీ..

వ‌ర్షాల కార‌ణంగా ఛార్‌దామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతున్నది. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ల‌ను సంద‌ర్శ‌కుల తాకిడి త‌గ్గింది. ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున యాత్రలో పాల్గొంటున్నారు. యాత్ర మొదలైనప్పటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 26.49లక్షల మంది ఛార్‌దామ్‌లను సందర్శించారు. ఇప్పటి వరకు బద్రీనాథ్‌ను 9,70,610, కేదార్‌నాథ్‌ను 8,81,265, గంగోత్రి 4,50,915 మంది, యమునోత్రి ధామ్‌ను 3,46,132 మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement