Sunday, May 12, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ-శ్రీవారి ద‌ర్శ‌నానికి 12గంట‌ల స‌మ‌యం

శ్రీవారి ద‌ర్శ‌నానికి 12గంట‌ల స‌మ‌యం ప‌డుతోంద‌ని టిటిడి అధికారులు వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు.కాగా నిన్న స్వామివారిని 69,012 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,195 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.59 కోట్లు వచ్చిందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement