Thursday, May 2, 2024

క్రికెటర్ పీయూష్ చావ్లా ఇంట్లో విషాదం

భారత క్రికెటర్ పియూష్ చావ్లా కుటుంబంలో విషాదం నెలకొంది. పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనాతో సోమవారం నాడు మృతి చెందారు. ప్రమోద్ కుమార్ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని పియూష్ చావ్లా స్వయంగా వెల్లడించాడు. తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తి దూరమయ్యాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని, తన బలం తన తండ్రేనని, కానీ ఇవాళ ఆయన్ను కోల్పోయానని పియూష్ చావ్లా తీవ్ర విచారం వెలిబుచ్చాడు. కాగా మరోవైపు మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కుటుంబంలోనూ విషాదం నెలకొంది. వేదా తల్లి, సోదరి కొన్నివారాల వ్యవధిలో కరోనాకు బలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement