Monday, May 6, 2024

COVID Update : దేశంలో తగ్గిన కరోనా కేసులు… కొత్తగా ఎన్నంటే..?

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త వారంతో పోలిస్తే ఈ వారంలో భారీగా త‌గ్గాయి. ఏకంగా 5 వేల కేసుల నుంచి 4 వేల కేసుల‌కు ప‌డిపోయాయి. తాజాగా భారత్‌లో గత 24 గంటల్లో 4,043 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ నుంచి 4,676 మంది కోలుకోగా, వైరస్‌తో తొమ్మిది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 47,379 యాక్టివ్‌ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.37 శాతంగా ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,43,089కి పెరిగింది. ఇందులో 4,39,67,340 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 5,28,370 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement