Sunday, May 19, 2024

నేడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. చిత్తూరు జైల్లో ఉన్న కుప్పంలోని పార్టీ నేతలను చంద్రబాబు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో చిత్తూరు జైలుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు చిత్తూరు సబ్ జైలుకు చంద్రబాబు చేరుకోనున్నారు. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నేతలతో ములాఖత్ కానున్నారు. ఆ తర్వాత చిత్తూరు మాజీ మేయర్ హేమలత ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement