Sunday, May 5, 2024

హోమియోపతి కోర్స్‌లో ప్రవేశాలకు 22న కౌన్సెలింగ్‌

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలల్లో బిహెచ్‌ఎంఎస్‌ కోర్స్‌లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా యాజమాన్య కోటా హోమియోపతి డిగ్రీకోర్సులోని మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 22న జెఎన్టీయూ కూకట్‌పల్లి హైదరాబాద్‌కు నిర్దేశిత సమయాన కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

మరింత సమాచారానికి యానివర్సిటీ వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌ చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement