Wednesday, May 15, 2024

తెలంగాణలో ఆగని కరోనా ప్రళయం.. ఒక్కరోజే 4,009 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే ఏకంగా 4,009 పాజిటివ్ కేసులు వచ్చాయి. అటు కరోనా కారణంగా 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు మొత్తం 1,838 మంది మృత్యువాత పడ్డారు. కరోనా బారి నుంచి నిన్న 1,878 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లోనే 705 కేసులు వచ్చాయి. మేడ్చల్-363, నిజామాబాద్-360 కేసులు నమోదయ్యాయి. అటు ఇప్పటి వరకు మొత్తం 1,18,20,842 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement