Wednesday, May 1, 2024

సాయి ప్రణీత్‌కు కరోనా పాజిటివ్‌..

భారత స్టార్‌ షట్లర్‌ సాయి ప్రణీత్‌ కరోనా బారినపడ్డాడు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేతైన సాయిప్రణీత్‌కు వైద్య పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆదివారం సీజన్‌ ఓపెన్‌ ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆర్టీ పీసీఆర్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సాయిప్రణీత్‌ తెలిపాడు.

జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని వివరించాడు. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నట్లు సాయి ప్రణీత్‌ మీడియాకు తెలిపాడు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఎఐ) జనరల్‌ సెక్రటరీ అజయ్‌ సింఘానియా మాట్లాడుతూ యూఎస్‌డీ 400,000 టోర్నీ నుంచి ప్రణీత్‌ వైదొలిగినట్లు ధ్రువీకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement