Friday, April 19, 2024

పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

పాయకాపురం : పార్కుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్థానిక 62వ డివిజన్ ప్రకాష్ నగర్ ప్రాంతంలోని సుమారు ఏడు లక్షల వ్యయంతో ప్రకాష్ నగర్ పార్కు నందు ప్రహరీ గోడ మరమ్మతులు పిల్లల ఆట పరికరములు, గ్రీనరీతో కూడిన పార్కును సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీశైలజ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ… నగర పాలక సంస్థ సాధారణ నిధులతో ఈ పార్క్ అభివృద్ధికి సుమారు 7లక్షల వ్యయం చేయడం జరిగిందని వారు అన్నారు. స్థానికులందరూ కలసి కమిటీగా ఏర్పడి పార్కు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ ల కార్పొరేటర్స్, వైసీపీ నేతలు అలంపూరు విజయ్ కుమార్, ఎస్కే మస్తాన్, కుంచెం యోహాను, గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నందేపు సురేష్, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏ.వీ.ఎస్ రెడ్డి రోడ్డులోని వీర్ల బాలరాజు పార్కును సుమారు రెండు లక్షల వ్యయంతో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీశైలజ, స్థానిక కార్పొరేటర్ పాలంపూర్ విజయలక్ష్మిలు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement