Thursday, May 9, 2024

కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తెలంగాణ‌లో కొత్తగా 771 కరోనా కేసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 771 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులను కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 20, 617కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 581 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5733కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 39, 320మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 289, కరీంనగర్‌లో 31, మేడ్చల్‌ మల్కాజిగిరి 47, నల్గొండ 28, రంగారెడ్డి 53, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement