Thursday, April 25, 2024

బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం రేపింది. వర్సిటీలోని సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపడుతున్న విద్యార్థుల్లో కొందరు అస్వస్థతకు గురయ్యారు. పీ1, పీ2కి చెందిన కొంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. జ్వరం, జలుబు, తలనొప్పి, విరేచనాలతో బాధపడుతున్నట్లుగా తెలిసింది.

అయితే ఆరుగురు విద్యార్థులకు కరోనా బారినపడినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన విద్యార్థులకు కరోనా చికిత్సకు సంబంధించిన మందులను ఇస్తున్నారు. మరోవైపు తమను ఎవరూ పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వర్సిటీలోనూ కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement