Friday, May 3, 2024

ప్రమాదకరస్థాయిలో కరోనా విజృంభణ, కొత్తగా 563 కేసులు నమోదు

కరోనా మహమ్మారి మరోసారి ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోంది. తెలంగాణలో ప్రతి రోజూ 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖకు చేరిన లెక్కల ప్రకారమే 500కు పైగా కేసులు నమోదవుతుంటే… చేరని, అనధికారిక కేసులు మరిన్ని ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 563 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 434 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4882కు చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా 25, 801 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 297 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… భద్రాది, ఖమ్మం జిల్లాల్లో 15, కరీంనగర్‌, మంచిర్యాల 10, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 46, రంగారెడ్డిలో 64, హన్మకొండ 11, సంగారెడ్డిలో 13 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement