Tuesday, April 30, 2024

క‌రోనా మందు అని చెప్పి మ‌త్తుమందు ఇచ్చి.. ఆపై బాలిక‌పై లైంగిక దాడి

చిన్న‌పిల్ల‌ల‌కు చాక్లెట్ ఇప్పిస్తాన‌ని చెప్పి ఒక‌డు, బొమ్మ‌లు చూపెట్టి మ‌రొక‌డు.. ఇలా అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌పై లైంగిక దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఒ కామాంధుడు బాలిక‌కు క‌రోనా మందు ఇప్పిస్తాన‌ని చెప్పి మ‌త్తుమందు ఇచ్చిన ఘ‌ట‌న కాకినాడ‌లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే కాకినాడ‌లో హాస్టల్‌లో ఉంటున్న బాలిక లైంగిక దాడికి గురైంది. హాస్టల్‌ నిర్వాహకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె గర్భందాల్చింది. సెలవులో ఇంటికి వచ్చిన బాలికకు గర్భస్రావంకావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక‌ను త‌ల్లి గ‌ట్టిగా మంద‌లించ‌గా జ‌రిగిన విషయాన్ని తల్లికి వివరించింది. కరోనా మందు పేరిట బాలికకు మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టినట్లు తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా పరీక్షించిన వైద్యులు నిందితుడు అఘాయిత్యంతో బాలిక గర్భందాల్చిందని వైద్యులు నిర్దారించారు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారిలో ఉండగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement