Thursday, April 25, 2024

క్రికెటర్ అశ్విన్ ఇంట్లో 10మందికి కరోనా

టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్ద వాళ్ళు నలుగురు పిల్లలకు పాజిటివ్ తేలిందని… పిల్లల వల్ల అందరికీ పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చారు.

అందుకే గత వారం ఓ పీడకలలా గడిచింది. అందరూ జాగ్రత్తగా ఉండండి..టీకా తీసుకోండి అంటూ అశ్విన్ భార్య ట్వీట్ చేసింది. ఇప్పటికే ఐపీఎల్ నుంచి అశ్విన్ బయటికి వచ్చాడు. తన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం వల్ల ఐపీఎల్ కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement