దేశంలో మరో సారి కరోనా కేసులు పెరిగాయి. నిన్న రెండు లక్షల లోపు కేసులు నమోదు కాగా తాజాగా 2,08,921కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 4,157మంది కరోనాతో మృతి చెందారు. అలాగే కొత్తగా మరో 2,95,955 మంది కరోనా నుంచి కొలుకున్నారు.
ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసులు 2,71,57,795కి చేరింది. అలాగే 2,43,50,816 మంది కొలుకున్నారు. అలాగే మొత్తం 3,11,388 మంది మృతి చెందారు. ఇక దేశంలో 24,95,591 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తమిళనాడులో 34,285, కేరళలో 29,803, మహారాష్ట్రలో 24,136, కర్ణాటకలో 22,758, బెంగాల్ లో 17,005కేసులు వచ్చాయి.