Thursday, May 2, 2024

తగ్గేదేలే…ఇండియాలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

ఇండియా లో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,353 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇండియా లోమొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 3,20,36,511 కి చేరింది.  అలాగే ఇందులో 3,12,20,981 మంది ఇప్ప‌టికే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం 3,86,351 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 497 మంది మృతి చెందారు.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,29,179కి చేరింది. తాజాగా  కేర‌ళ‌లో అత్య‌ధికంగా 21వేల‌కు పైగా కేసులు న‌మోద‌వ్వ‌గా, మహారాష్ట్ర‌లో 5 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement