Wednesday, May 15, 2024

ఏరోజుకారోజు పెరుగుతున్న కరోనా కేసులు… తాజాగా 285 కొత్త కేసులు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఏ రోజుకారోజు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 285 కొత్త కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7, 95, 293కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో మరో 65 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1621కి చేరింది. రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా టెస్టులను పెంచింది.

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 28, 424 కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజా కేసుల్లో 188 కరోనా కేసులు ఒక్క హైదరాబాద్‌ మహానగరంలోనే నమోదయ్యాయి. మేడ్చల్‌-మల్కాజిగిరిలో 16, రంగారెడ్డిలో 54 కేసులు నమోదయ్యాయి. హన్మకొండలో 4, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మూడేసి చొప్పున కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement