Friday, April 26, 2024

ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో భారీ స్థాయిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడచిన 24 గంటల్లో1,00,636 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,89,09,975 కి చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 14,01,609 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

మరోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2427 మంది మృతిచెందారు. దీంతో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,49,186 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 1,74,399 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement