Saturday, May 4, 2024

వేగంగా రైల్వే జోన్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ సహా అనేక భవనాల నిర్మాణం : అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా సంబంధిత విభాగాలకు ఆదేశాలిచ్చినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుపై రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ ఆర్థిక సంవత్సరం (2022 23)లో రూ.7.29 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు వెల్లడించారు.

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణానికి రూ. 106.89 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించామని, భూ సర్వే, హెడ్‌క్వార్టర్స్ కాంప్లెక్స్ లే అవుట్, నివాస కాలనీ సహా నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలని రైల్వే శాఖను కోరామని అన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా ఇప్పటికే సంబంధిత కమిటీ సమర్పించిందని వివరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement