Friday, April 26, 2024

Follow up | నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటులో నడిచాయి. మార్కెట్‌లో ఏ దశలోనూ సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. విదేశీ మదుపర్లు శుక్రవారం నాడు భారీగా అమ్మకాలు జరిపారు. ఎంఎస్‌సీఐలో అదానీ కంపెనీల షేర్ల వెయిటేజీ సమీక్ష కూడా ఆ కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యేందుకు దారితీసింది.

సెన్సెక్స్‌ 123.52 పాయింట్ల నష్టంతో 60682.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.95 పాయింట్ల నష్టంతో 17856.50 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 88 రూపాయలు తగ్గి 5676 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 187 రూపాయల తగ్గి 66843 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.64 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

- Advertisement -

టాటా మోటార్స్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టైటాన్‌ కంపెనీ, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, అపోలో ఆస్పటల్స్‌, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, నెస్లే ఇండియా, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, విప్రో, జేఎస్‌బడ్ల్యూ, ఐటీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, దివిస్‌ ల్యాబ్‌, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement