Friday, April 26, 2024

గోరంట్ల మాధవ్ పై ఫేక్ వీడియోతో కుట్ర… కొడాలి నాని

టీడీపీ నేతలు రోజూ ఏదో ఒక కుట్ర చేస్తుంటారని.. ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఫేక్ వీడియోతో కుట్ర చేశారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అదే వీడియో పై ఫోరెన్సిక్ రిపోర్టు అంటూ మరో కుట్ర చేశారన్నారు. మతాలపై దుష్ర్పచారం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయంగా దిగజారి పోయారన్నారు. పవన్ కల్యాణ్ కూడా దిగజారి మాట్లాడుతున్నారని కొడాలి నాని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement