Monday, April 29, 2024

ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో డీఐజీ ఆకస్మిక తనిఖీలు

కర్నూలు జిల్లాలోని ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డీఐజీ పీజీఎస్ కళ్యాణి ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలో రికార్డులను డీఐజీ పరిశీలించారు. రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిరాని సాకులు చెప్పి పెండింగ్‌లో ఉన్న 400 డాక్యుమెంట్లును రేపటిలోగా కంప్లీట్ చేయకపోతే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యాలయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఐజీ కళ్యాణి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement