Saturday, May 4, 2024

మధుయాష్కీ నివాసంలో కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం

తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ ఛైర్మన్ మధుయాష్కీ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక ఇంఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవా, తెలంగాణ‌ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, హర్కల వేణుగోపాల్ రావు కూడా హాజ‌రయ్యారు.

కాగా బుధవారం నాడు రాయచూరులో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి నేత‌లు హైద‌రాబాద్ నుంచి వెళుతున్న‌ట్టు స‌మాచారం. ఇక నేడు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్, సూర్జేవాలు బ‌స చేయ‌నున్నారు. బుధవారం ఉదయం నేత‌లంతా రాయచూరుకు బ‌య‌లు దేర‌నున్నారు.

ఈ వార్త కూడా చదవండి: టీచర్ పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

తాజా వార్తలు

Advertisement