Sunday, April 28, 2024

తెలంగాణలో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలు

దేశ వ్యాప్తంగా అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ కూడా అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. మల్కాజ్‌గిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ సత్యగ్రహ దీక్షకు ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సత్యగ్రహ దీక్షలో వీ.హనుమంతరావు పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకోవద్దని, వెంటనే అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement