Sunday, May 5, 2024

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కు కరోనా..

కరోనా కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రతిరోజు 2 లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దిగ్విజ‌య్‌సింగ్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న ఢిల్లీలోని త‌న నివాసంలో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విష‌యాన్ని దిగ్విజ‌య్‌సింగ్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ మ‌ధ్య‌కాలంలో త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన‌ పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు క‌రోనా నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, కొన్ని రోజులపాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌ని ఆయన కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement