Sunday, April 28, 2024

భారత్‌ జోడోకు 50 రోజులు పూర్తి.. సెప్టెంబర్‌7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్‌ యాత్ర

భారత్‌ జోడో యాత్ర నుంచి ఆంధ్రప్రభ ప్రతినిధి : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తొలిమైలురాయి చేరుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలోని ఎలిగండ్ల వరకు ఆయన పాదయాత్ర రావడంతో గురువారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 150 రోజుల్లో 12 రాఫ్లోని 3,570 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలన్నది లక్ష్యం కాగా, అందులో గురువారం నాటికి 50 రోజులు పూర్తయింది.

ఇప్పటివరకు మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో 1325 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేశారు. తమిళనాడులోని 2 జిల్లాలు, కేరళలో 7 జిల్లాలు, కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 2 జిల్లాల్లో యాత్ర పూర్తి కాగా ప్రస్తుతం తెలంగాణలోని మొదటి జిల్లా (నారాయణపేట)లో యాత్ర జరుగుతోంది. ఈ యాత్ర నవంబర్‌7 వరకు కొనసాగనుంది. తెలంగాణలో యాత్ర పూర్తి కావడంతో దేశంలోని 5 రాష్ట్రాలు, 26 జిల్లాల్లో 1670 కిలోమీటర్లు రాహుల్‌ యాత్ర జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement