Tuesday, May 7, 2024

రెండేళ్ల క్రితం ఫిర్యాదు- ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ పై కేసు న‌మోదు

టిఆర్ ఎస్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ పై పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు అయింది. 2020 లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఆ సమయంలో తనకు ప్రాణహాని ఉంది.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి అందించాడు బాధితుడు. దాదాపు రెండేళ్ల తర్వాత స్పందించిన పోలీసులు… మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 290, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రసమయిపై సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement