Monday, April 29, 2024

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని గౌడ కులస్తులతో అమ్మవారిపై ప్రమాణం చేయించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో మంగళవారం గౌడ కులస్తులతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గుడి నిర్మాణం కోసం రూ.10 లక్షలు ఇస్తానని, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఎల్లమ్మ అమ్మవారిపై గౌడ కులస్తులతో ఎమ్మెల్యే ప్రమాణం చేయించారని, ఓటు కోసం ప్రజలకు డబ్బులు ఆశ చూపారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి శాసనసభ్యత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: ప్రతి ఆదివారం పూర్తిగా లాక్‌డౌన్

Advertisement

తాజా వార్తలు

Advertisement