Thursday, May 16, 2024

క్రీడ‌ల‌తో పోటీత‌త్వం.. మాన‌సికంగా, శారీర‌కంగా ఫిట్ అవుతారు

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తూర్పుగోదావరి రౌతులపూడి ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి, జడ్పిటిసి గొర్లు చిన్నదివానం అన్నారు. రౌతులపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏపీ సీఎం కప్ క్రీడలను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నతనం నుండే క్రీడలపై ఆసక్తి ఉండాలన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు.

మండలం నుంచి పాల్గొని తొమ్మిదిమంది టీములకు వారు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రౌతులపూడి సర్పంచ్ కఠారి అర్జుమ్మ, మండల కో ఆప్షన్ సభ్యులు చింతకాయల వీర వెంకట సత్యనారాయణ, రౌతులపూడి మండల కన్వీనర్ జిగి రెడ్డి శ్రీను, రౌతులపూడి ఉపసర్పంచ్ రెడ్డి భాస్కర్ బాబు, మండలం మేనేజర్ రామ కుర్తి బాబ్జి, మండల విద్యాశాఖ అధికారి ఎస్. వి. నాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాడి కొండబాబు, .పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement