Saturday, April 27, 2024

Rain: చ‌ల్ల‌టి శుభవార్త – నేటి నుంచి నాలుగురోజుల పాటు వ‌ర్షాలు ..

మార్చిలో ఎండ‌ల‌తో మండిపోతున్న జ‌నాల‌కు వాత‌వ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌టి శుభ‌వార్త వినిపించింది.. ఏపీ, తెలంగాణ‌ల‌లో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిషా, చండీగఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో 16 నుంచి 21 వరకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇక మార్చి 20, 21తేదీల్లో జమ్మూకాశ్మీర్, లడఖ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 16 నుంచి మార్చి 18 వరకు తూర్పు, మధ్య భారతదేశంలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్, ఒడిశా, బీహార్ తూర్పు భాగంలో ఈ ప్రభావం ఉండొచ్చని తెలిపారు.

ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే సూరీడు మండిపోతున్నాడు. దీంతో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. దీంతో వాతావరణ శాఖ చెప్పిన కబురుతో వర్షాలు కురిస్తే ఉపశమనం పొందాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక పిల్లలకు వడదెబ్బ తగలకుండా స్కూల్ పిల్లలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement