Wednesday, May 1, 2024

TamilNadu: సీఎం పొంగ‌ల్ గిఫ్ట్… న‌గ‌దుతో పాటు కానుక‌ల పంపిణీ..

పొంగల్‌ కానుకల పంపిణీని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఆళ్వార్‌పేట శ్రీరాంనగర్‌లో ఉన్న రేషన్‌ దుకాణంలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొని, కార్డుదారులకు పొంగల్‌ కానుకలను అందించనుండగా, అనంతరం అన్ని రేషన్‌ దుకాణాల్లో రూ.1,000 నగదుతో కూడిన పొంగల్‌ కానుక ప్రారంభం కానుంది.

అదే సమయంలో రేషన్‌ దుకాణాల వద్ద రద్దీ నియంత్రించేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.24 కోట్ల రేషన్‌ కార్డులుండగా, వాటిలో 4 లక్షల చక్కెర కార్డులు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులు అని మరో 24 లక్షల కార్డులున్నాయి. ఈ కార్డులు కలిగిన వారు పొంగల్‌ కానులకు అనర్హులు. మిగిలిన 1.86 కోట్ల రేషన్‌ కార్డుదారులు పొంగల్‌ బహుమతులు అందుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పలు వర్గాలు, పార్టీల నుంచి అందిన వినతులతో అన్నిరకాల కార్డుదారులకు రూ.1,000 నగదుతో కూడిన పొంగల్‌ బహుమతి అందించనున్నట్లు సీఎం స్టాలిన్‌ మంగళవారం ప్రకటించారు. ఈ పథకంలో అందించే సరుకుల కొనుగోలుకు తొలివిడతగా రాష్ట్రప్రభుత్వం ఈనెల 4వ తేది రూ.239 కోట్లు విడుదల చేయగా, సోమవారం మిగిలిన రూ.1,828 కోట్లు కేటాయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement