Saturday, April 27, 2024

ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి : మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణలో దేవాల‌యాల‌ను అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు మంజూరు చేస్తున్నార‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆల‌యాల అభివృద్ధికి ఎంత‌గానో కృషి చేస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. క‌నీవిని ఎరుగ‌ని రీతిలో యాదాద్రి ఆల‌యాన్ని రూ.12 వంద‌ల కోట్ల వ్య‌యంతో నిర్మించార‌న్నారు. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా.. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంద‌ని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మండలం పుప్పాలగూడలోని సంక‌టహ‌ర‌ణ శ్రీ హ‌నుమాన్ ఆల‌యంలో న‌వ‌గ్రహ విగ్రహ ప్రతిష్టాప‌న మ‌హోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక‌ట హ‌ర‌ణ హ‌నుమాన్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement