Thursday, April 18, 2024

సద్దుల చెరువులో పడిన వ్యక్తి మృతి..

సూర్యాపేట : ప్రమాదవశాత్తు సద్దుల చెరువులో పడిన వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం సూర్యాపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం యార్కరం గ్రామానికి చెందిన బోర్ర లింగయ్య (25) బ్యాండ్ వాయిద్య కారుడు. సూర్యాపేట పట్టణంలోని ఎస్ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో యర్కారం గ్రామానికి చెందిన వివాహానికి బ్యాండ్ వాయించేందుకు వచ్చారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న చెరువులో బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో కాలుజారి పడ్డాడు. నీళ్లలో మునిగి గంట వరకు ఆచూకీ లభించలేదు.. గ్రామస్తులు చెరువులో వెతికి మృతదేహాన్ని వెలికితీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement