Friday, April 19, 2024

బండి సంజయ్ దిష్టిబొమ్మ ద‌హ‌నం..

భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచితంగా మాట్లాడటంపై ఢిల్లీలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు.. ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు బీఆర్‌ఎస్‌ నేతలు. కవితపై చేసిన అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బండి సంజయ్ అనుచితంగా మాట్లాడటంపై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ను బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే తెలంగాణలోనూ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement