Monday, April 29, 2024

రేపు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రేపు నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. సీఎం కేసీఆర్ స‌భ ఏర్పాట్ల‌ను మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ప‌రిశీలించారు. జీజీ కాలేజ్ గ్రౌండ్ తో పాటు నూత‌న క‌లెక్ట‌రేట్ ను ప్ర‌శాంత్ రెడ్డి ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… రేపు మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ జిల్లాకు వ‌స్తున్నార‌న్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం తర్వాత జిల్లా కలెక్టరేట్ ను పరిశీలిస్తారన్నారు. రేపటి మీటింగ్ లో జాతీయ రాజకీయాలపై మాట్లాడతారన్నారు. ఐటీ, ఈడీ దాడులపై ప్రజలకు వివరించే అవకాశముందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement