Thursday, April 25, 2024

డిసెంబర్‌ 4న మహబూబ్‌ నగర్‌, 7న జగిత్యాలకు సీఎం కేసీఆర్‌..

డిసెంబర్‌ నెలలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో వివిధ జిల్లాలో పర్యటించనున్నారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధమయ్యారు. డిసెంబర్‌ 4న బహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. డిసెంబర్‌ 7న జగిత్యాలలో కేసీఆర్‌ సభ ఉండనుంది. అయితే జగిత్యాల సభకు ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ కవితను నియమించారు. దాదాపు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఈ సభలకు ఇప్పటికే ఇన్‌చార్జిలను సైతం నియమించారు. అదేవిధంగా కేసీఆర్‌ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇదిలా ఉండగా సోమవారం జరిగే కలెక్టర్ల సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లిd సమావేశాలు ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement