Sunday, April 28, 2024

సిరిసిల్లకు సీఎం కేసీఆర్.. పర్యటన షెడ్యూల్ ఇదే

సీఎం కేసీఆర్‌ నేడు రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లి దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‎ను ప్రారంభిస్తారు. సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల, సర్ధాపూర్‌లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్(కలెక్టరేట్) భవనంను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో పటిష్ట భద్రతను  ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కష్టాలు.. ఢిల్లీలో మకాం వేసిన మంత్రి..?

Advertisement

తాజా వార్తలు

Advertisement