Friday, May 3, 2024

Kcr delhi tour: ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో కేసీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని మోడీతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు… రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా విభజన కు సంబంధించిన హామీలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని మోడీ మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్‌. అలాగే కాగా.. టీఆర్‌ఎస్‌ పార్టీ భవన శంకుస్థాపన నేపథ్యం లో నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిన్న ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

ఇది కూడా చదవండి: pspk 28: మళ్లీ ఫుల్లీ లోడింగ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement