Thursday, April 25, 2024

వ‌ర్షాల‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్

వ‌ర్షాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అత్య‌వ‌స‌ర స‌మీక్ష నిర్వ‌హించారు. క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. నెల్లూరు, చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల్లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌తో చ‌ర్చించారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ముఖ్యంగా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెలుసుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రభావిత ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement